News August 6, 2024
MBNR: అరుణాచల గిరికి ప్రత్యేక బస్సు.. ఫోన్ చేయండి !

తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణకు మహబూబ్ నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఆగస్టు 17న రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందని, అరుణాచలేశ్వరస్వామి గిరిప్రదక్షిణ పూర్తయ్యాక 19న మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగుపయనమవుతుందని, రూ.3,600 టిక్కెట్ ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 99592 26285, 94411 62588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News April 13, 2026
జడ్చర్ల: ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు

జడ్చర్ల పట్టణంలోని TGMRSJC G1 జడ్చర్ల విద్యార్థినులు ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ కల్పనా తెలిపారు. వారి వివరాలు..
1st MPC- షాజ్మీన్ నికత్-468/470
1st BPC- బి.మౌనిక-438/440
2nd MPC- పి.మౌనిక-983/1000
2nd BPC- నజూబ్ బేగం-990/1000 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం విద్యార్థులను సన్మానించారు.
News April 13, 2026
MBNR: ఉక్కపోతతో.. అల్లాడుతున్న జిల్లా వాసులు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 41.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్ పేట 41.3, దేవరకద్ర 41.2, మహమ్మదాబాద్ 41.1, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 41.0, అడ్డాకుల 40.8, కోయిలకొండ మండలం పారుపల్లి, సిరి వెంకటపూర్ 40.5, నవాబుపేట, మహబూబ్ నగర్ అర్బన్ 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. MBNRకు 17th Rank

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. MBNR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 8,116 మంది పరీక్షలు రాయగా 5,896 మంది పాసై 72.65%తో స్టేట్లో 17వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 1,740 మందికి 1,432మంది పాసై 82.30%తో 6వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 1,049 మందికి 364 మంది పాసై 34.70%తో 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 110 మందికి 54 మంది పాసై 49.09%తో 21వ ప్లేస్ వచ్చింది.


