News April 12, 2024
MBNR: ఆన్లైన్ మోసం.. రూ.36లక్షలు స్వాహా !
ఆన్లైన్లో పరిచయమై ఓ వ్యక్తిని నమ్మించి తన ఖాతాలోంచి రూ.36 లక్షలు ఖాళీ చేసిన ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. SI చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సునీల్ జవహర్కు ఆన్లైన్లో గుర్తుతెలియని వ్యక్తి పరిచయం కాగా.. గూగుల్ వ్యూస్స్ ఇస్తే డబ్బులు వస్తాయని దీని కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన అతను సునీల్ ఖాతా నుంచి రూ.36 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News October 11, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యవార్తలు!!
✔DSC-2024 ఉద్యోగాలు సాధించిన పలువురికి ఘన సన్మానం
✔IMEX అమెరికా 2024 ట్రేడ్ షోలో పాల్గొన్న మంత్రి జూపల్లి
✔GDWL:పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి
✔NRPT: చెట్టుకు ఢీకొని కారు దగ్ధం
✔MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక
✔సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కలెక్టర్లు
✔ఘనంగా బతుకమ్మ సంబరాలు
✔మక్తల్:రోడ్డు ప్రమాదం..మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శ్రీహరి
News October 10, 2024
మహబూబ్నగర్లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్నగర్లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <
News October 10, 2024
కొడంగల్: నాన్నకు ప్రేమతో..!
కొడంగల్ మండలం హుస్నాబాద్కు చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించేందుకు నిరంతరం శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్య డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్జీటీగా ఎంపికైంది. దీంతో గ్రామస్థులు అభినందించారు.