News June 30, 2024

MBNR: ఆర్టీసీ సేవలకు విశేష స్పందన !

image

ఉమ్మడి జిల్లా ఆర్టీసీ కార్గోలో వినూత్న సేవలు చేపట్టారు. సమ్మక్క, సారక్క జాతరను పురస్కరించుకొని భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందించారు. మూడేళ్ల నుంచి శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇంటివద్దకే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు అనే కార్యక్రమాలు చేపట్టగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,708 బుకింగ్ చేసుకున్న మందికి ఇంటివద్దకే ప్రసాదాన్ని అందజేశారు.

Similar News

News September 20, 2024

రూ. 4.60 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

image

భారీ గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహా వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేలంపాటలో గణేశుడి చేతిలోని లడ్డు ప్రసాదాన్ని మాజీ వార్డు సభ్యులు గడ్డమీది శ్రీనివాసులు రూ. 4.60 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం వేలాది మంది భక్తులు ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

News September 20, 2024

రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలబెట్టాలి: సిక్తా పట్నాయక్

image

విద్యలో జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కేజీబీవీ పాఠశాలలో నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపి వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయాలని అన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు.

News September 19, 2024

శ్రీశైలం డ్యాం తాజా సమాచారం..

image

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880.6 అడుగుల వద్ద 191.2118 టీఎంసీలుగా ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తంగా జలాశయానికి 21,879 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. భూగర్భ కేంద్రం, ఏపీ జెన్కో పరిధిలో విద్యుత్ ఉత్పత్తికి మొత్తం 67,156 క్యూసెక్కుల నీటిని వినియో గిస్తున్నారు. భూగర్భ కేంద్రంలో 16.879 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.697 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు.