News March 24, 2025

MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 1, 2025

5 స్టార్ రేటింగ్ సాధించిన మరిగడ్డ పాఠశాల

image

చందుర్తి మండలం మరిగడ్డ ప్రాథమిక పాఠశాల స్వచ్ఛ హరిత విద్యా రేటింగ్ సాధించింది. జాతీయ స్థాయిలో 2025- 26 సంవత్సరాన్నికి స్వచ్ఛ హరిత విద్యాలయం రేటింగ్లో జిల్లా నుంచి 650 పాఠశాలలు పాల్గొన్నాయి. మరిగడ్డ పాఠశాల 5 స్టార్ రేటింగ్ పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతిరావు ప్రశంసా పత్రం అందుకున్నారు.

News December 1, 2025

AP NIT, YSR ఉద్యాన వర్సిటీ మధ్య MOU

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్(AP NIT)తో వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. డ్రోన్ టెక్నాలజీ, డ్రయ్యర్ టెక్నాలజీ, నీటి పారుదలలో ఆధునిక యాంత్రికరణ, తెగుళ్లు గుర్తించడం, నానో టెక్నాలజీ తదితర అంశాల్లో రైతులకు అవగాహన కల్పించి ఖర్చులు తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఏపీ నిట్ డైరెక్టర్ రమణ రావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు.

News December 1, 2025

TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.