News April 10, 2024

MBNR: ఇంటికే రాములోరి తలంబ్రాలు.. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి !

image

భద్రాచలం శ్రీరాముడి తలంబ్రాలు నేరుగా ఇంటికే అందించనున్నట్లు ఆయా డిపోల ఆర్టీసీ డీఎంఈలు తెలిపారు. రూ.151 చెల్లించి ఈనెల 18 వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
1.మహబూబ్ నగర్-91542 98612
2.నాగర్ కర్నూల్-96189 65885
3.కోస్గి-63051 09009
4.గద్వాల్-91542 98609
5.అచ్చంపేట-91542 98608
6.కల్వకుర్తి-91542 98610
7.కొల్లాపూర్-91542 98611
8.నాగర్ కర్నూల్-91542 98613

Similar News

News April 19, 2026

MBNR: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల విలవిల

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.4, గండీడ్ మండలం సల్కర్ పేట 43.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 43.2, అడ్డాకుల 43.0, కోయిలకొండ మండలం పారుపల్లి 42.9, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ అర్బన్ 42.6, దేవరకద్ర 42.5 ఉష్ణోగ్రత నమోదయింది.

News April 19, 2026

MBNR: ప్రముఖ కవి కమలేకర్‌ దాగోజీరావు కన్నుమూత

image

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పండితులు ఆచార్య కమలేకర్‌ దాగోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. భగీరథ కాలనీలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. నేటి సాయంత్రం 4 గంటలకు వీరన్నపేట శివాలయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల సాహితీలోకం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

News April 18, 2026

జడ్చర్ల: సురేశ్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

image

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.