News March 26, 2024

MBNR: ఇంటి నుంచే ఓటు.. ఈసీ వెసులుబాటు!

image

మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 1,916 పోలింగ్ కేంద్రాలు ఉండగా..16,80,417 మంది ఓటర్లు ఉన్నారు.85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు 6,047 మంది, దివ్యాంగ ఓటర్లు 32,731 మంది ఉన్నారు. వీరికి పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బంది ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్‌లో ఓటు వేయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. హోం ఓటింగ్ ప్రక్రియకు ఫారం-12డీ దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది.

Similar News

News November 28, 2025

MBNR: AHTU.. NOVలో 24 కార్యక్రమాలు: ఎస్పీ

image

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU)-2025 నవంబర్‌లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో మొత్తం 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళా భద్రత విభాగం హైదరాబాద్ ఆదేశాల మేరకు.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్‌పోల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఆపరేషన్ స్ట్రోమ్ మేకర్స్–3’ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

News November 28, 2025

MBNR: ‘టీ-పోల్‌’ యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టీ-పోల్’ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. ఈ యాప్‌ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు.

News November 28, 2025

MBNR: జీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్‌

image

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఎన్నిసార్లు ఎన్నికలు నిర్వహించినా ప్రతిసారీ సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల అధికారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.