News December 3, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో ఈ మండలాలు ఇక ప్రజా పరిషత్!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన మండలాలు ఇకపై మండల ప్రజా పరిషత్లుగా ఏర్పాటు కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, కౌకుంట్ల, గద్వాల్ జిల్లాలో ఎర్రవల్లి, వనపర్తి జిల్లాలో యేదుల, నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వీటికి ప్రత్యేకంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News January 23, 2025

జడ్చర్ల: అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు వస్తాయి: ఎమ్మెల్యే 

image

జడ్చర్ల మండలంలోని నసురుల్లాబాద్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా తాను సహించేది లేదని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులదేనని స్పష్టం చేశారు.

News January 23, 2025

కౌకుంట్ల : పేరూరులో సభ.. సద్వినియోగం చేసుకోండి

image

కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో నేడు ఉదయం 10:00 గంటలకు నిర్వహించే గ్రామ సభలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జీ. మధుసుధన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ సీసీ సెక్రటరీ, తెలంగాణ ఇన్‌ఛార్జ్ విశ్వనాథ్ అదే పాల్గొంటారు. ఈ సభను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ బరోసా కు వినతి పత్రాలను ఇవ్వాలన్నారు.

News January 22, 2025

MBNR: ప్రజల సమస్యలు తెలుసుకోడానికే గ్రామసభలు: మంత్రి

image

భూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవచ్చన్నారు. ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఆయన వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.