News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 17, 2026
విశాఖ రైల్వే స్టేషన్లో ‘బైక్ టాక్సీ’ పికప్ పాయింట్ ప్రారంభం

విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం వాల్తేరు డివిజన్ రైల్వే సరికొత్తగా ‘బైక్ టాక్సీ’ పికప్ పాయింట్ను అందుబాటులోకి తెచ్చింది. డీఆర్ఎం లలిత్ బోహ్రా దీనిని శుక్రవారం ప్రారంభించారు. నిరీక్షణ సమయం తగ్గించి, ప్రయాణికులకు వేగవంతమైన రవాణా అందించడమే దీని లక్ష్యం. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక డ్రైవర్లను కేటాయించారు. ఈ నిర్ణయం వేలాది ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనుంది.
News April 17, 2026
ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

ప్రకాశం జిల్లాలో జనగణన-2027లో భాగంగా ‘స్వీయ గణన'(Self-Enumeration) ప్రారంభమైందని కలెక్టర్ పి. రాజాబాబు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ఆయన తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు se.census.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. లాస్ట్లో వచ్చే యూనిక్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుని.. మేలో ప్రజల వద్దకు వచ్చే అధికారులకు వాటిని చూపాలని కోరారు.
News April 17, 2026
జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు జిల్లాలో పన్ను చెల్లింపుదారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి పరిశ్రమకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న రూ.190 కోట్ల బకాయిలను త్వరగా వసూలు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు, పరిశ్రమల చెల్లింపులను పర్యవేక్షించాలని ఆమె కోరారు. డీడీఓలు తప్పనిసరిగా జీఎస్టీ-టీడీఎస్ కింద నమోదు కావాలని పేర్కొన్నారు.


