News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 16, 2025
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.
News November 16, 2025
బాపట్ల: ‘స్కాన్ సెంటర్లకు రెన్యువల్ తప్పనిసరి’

స్కాన్ సెంటర్ నిర్వాహకులు రెన్యువల్ తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేని స్కాన్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, మెడికల్ వేస్ట్, బయో మెడికల్పై అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్వో పాల్గొన్నారు.
News November 16, 2025
సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న సత్యజ్యోతి

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో<<18299363>> వెయిట్లిఫ్టర్<<>> టీ.సత్యజ్యోతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 89 కిలోల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. దీంతో అప్పట్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ ప్రశంసలు కూడా అందుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్కు ఎంపికైన సత్యజ్యోతి మరి కొద్ది రోజుల్లోనే విధుల్లో చేరాల్సి ఉంది.


