News April 10, 2025

MBNR : ఏప్రిల్ 12వ తేదీ నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని MVS కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి & మహబూబ్ నగర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Similar News

News February 26, 2026

‘యూత్ పార్లమెంట్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన బండి సంజయ్

image

వికసిత్ భారత్ 2026 జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీల పోస్టర్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ నెల 28న ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ’50 ఏళ్ల ఎమర్జెన్సీ, భారత ప్రజాస్వామ్య పాఠాలు’ అంశంపై 18-25 ఏళ్ల యువతకు పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు ‘మై భారత్’ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, విద్యార్థులు తమ గళాన్ని జాతీయ స్థాయి వరకు వినిపించాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News February 26, 2026

జగిత్యాల: గంజాయి కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

జగిత్యాల జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, విక్రయానికి పాల్పడిన మెస్రాం నాగనాథ్‌కు గౌరవ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి ఎస్. నారాయణ 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. రాయికల్‌లో 1.5 కిలోల ఎండు గంజాయితో పట్టుబడిన నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 26, 2026

కడప: ఇవాళ పరీక్షకు 466 మంది గైర్హాజర్.!

image

కడప జిల్లాలో గురువారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ ఇంగ్లిష్ పరీక్షలు జరిగాయి. నేడు 16,861 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 16,395 మంది మాత్రమే రాశారు. 466 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 15,792 మంది రాయాల్సి ఉండగా.. 15,300 మంది రాశారు. 402 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,159 మంది రాయాల్సి ఉండగా.. 1,095 మంది రాశారు. 64 మంది రాయలేదు.