News April 10, 2025
MBNR: ఏప్రిల్ 12 నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ థర్డ్ ఇయర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని MVS కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.
Similar News
News October 14, 2025
RGM: సీజనల్ వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్సులు మస్ట్

ట్రేడ్ లైసెన్స్ లేకుండా సీజనల్ వ్యాపార విక్రయాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టపాసులు, ఉన్ని దుస్తుల విక్రయాలకు కూడా ఆన్లైన్లో తాత్కాలిక ట్రేడ్ లైసెన్సు పొందాలన్నారు. వెబ్ సైట్ https://emunicipal.telangana.gov.in ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.
News October 14, 2025
ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం: సివిల్ సప్లై అధికారి

ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం చేసినట్లు జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఫైజల్ హుస్సేని తెలిపారు. జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మొత్తం 176 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా, ధాన్యం కొనుగోలుకు కావల్సిన 46 లక్షల గన్నీ బ్యాగులకు గానూ, 30.39 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని అన్నారు.
News October 14, 2025
GDK: ఈనెల 15 వరకు డిగ్రీలో ప్రవేశాలు

డా.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీలోని వివిధ కోర్సులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 15 వరకు అవకాశం ఉందని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా, కో-ఆర్డినేటర్ డా.సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. వివరాలకు 7382929655ను సంప్రదించాలన్నారు.