News April 10, 2025

MBNR: ఏప్రిల్ 12 నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ థర్డ్ ఇయర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని MVS కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.

Similar News

News November 28, 2025

పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటిని డ్రైవ్ మోడ్‌లో క్లియర్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.
లాగిన్‌లో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయంటూ మండల సర్వేయర్, తహశీల్దార్‌లను కలెక్టర్ ప్రశ్నించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 28, 2025

NZB: సమస్యలపై పోరాడే వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి

image

న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరిలో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం NZB జిల్లా బార్ అసోసియేషన్‌లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, అక్రమాలు దాడులు మొదలగునవి అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ బిల్ ఎంతో అవసరం అన్నారు.

News November 28, 2025

KNR: వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును సందర్శించిన డీఎంహెచ్ఓ

image

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న కుటుంబ నియంత్రణ వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డా.సనా జవేరియాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సలు చేసుకోబోతున్న, చేసుకున్న అర్హులైన దంపతులను కలిసి మాట్లాడారు. కరీంనగర్ ఆస్పత్రిలో 7, జమ్మికుంట సీహెచ్సీలో 6, మొత్తం 13 మందికి వ్యాసెక్టమీ చికిత్సలు జరిగాయన్నారు.