News March 27, 2025
MBNR: కమీషన్ల ముంపులో కూరుకుపోయింది: ఆర్ఎస్పీ

‘మా SC- సబ్ ప్లాన్ నిధులు (రూ.35,000 కోట్లు) ఎక్కడికి వెళ్తున్నాయి?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ముంపులో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్కు చెందిన అత్యుత్తమ విద్యార్థి ఒకరు రాసిన లేఖను దయచేసి చదవండి అంటూ కోరారు.
Similar News
News December 9, 2025
మంగళగిరి: సీకే హైస్కూల్ ఈసారైనా రాణిస్తుందా?

మంగళగిరిలో ఏళ్ల చరిత్ర కలిగిన CKహైస్కూల్ విద్యార్థులు ఈసారైనా టెన్త్ ఫలితాల్లో రాణిస్తారా అనేది వేచి చూడాలి. గతంలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి మార్కులతో సత్తా చాటేవారు. కొన్నేళ్లుగా ర్యాంకుల సంగతి అటుంచితే ఉత్తీర్ణత శాతమే భారీగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ అమలు చేస్తున్న 100రోజుల ప్రణాళికను టీచర్లు పటిష్ఠంగా అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
News December 9, 2025
మంచిర్యాలలో విషాదం

మంచిర్యాలలోని ఏసీసీ సిమెంట్ కంపెనీ సమీపంలో సోమవారం రాత్రి రైలు కింద పడి సాగె శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన శ్రీనివాస్ ఏసీసీలో ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. పిల్లలు పుట్టడం లేదని బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ తెలిపారు.
News December 9, 2025
ఇండిగోపై చర్యలు తీసుకుంటాం: రామ్మోహన్ నాయుడు

ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ‘ఇండిగో సంక్షోభంపై విచారణకు ఆదేశించాం. ప్రయాణికుల ఇబ్బందికి యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ప్రయాణికుల భద్రతే ముఖ్యం. ఇప్పటికే DGCA నోటీసులు జారీ చేసింది. జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత ఇండిగోపై ఉంది. DGCA రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయి. కొత్త నిబంధనలు పాటిస్తామని ఇండిగో వివరణ ఇచ్చింది.’ అని తెలిపారు.


