News March 27, 2025

MBNR: కమీషన్ల ముంపులో కూరుకుపోయింది: ఆర్ఎస్పీ

image

‘మా SC- సబ్ ప్లాన్ నిధులు (రూ.35,000 కోట్లు) ఎక్కడికి వెళ్తున్నాయి?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ముంపులో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన అత్యుత్తమ విద్యార్థి ఒకరు రాసిన లేఖను దయచేసి చదవండి అంటూ కోరారు.

Similar News

News November 17, 2025

చిన్న అరుణాచలం ఆలయంలో అపశ్రుతి

image

దుమ్ముగూడెం మండలంలోని నరసాపురం గ్రామం చిన్న అరుణాచలం ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తులు దీపాలు వెలిగించిన అనంతరం ఆర్పే క్రమంలో నీళ్లనుకొని పక్కనే ఉన్న కార్పెంటైల్‌ను పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మహిళా భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News November 17, 2025

స్వర్ణ పంచాయతీల్లో 100% పన్ను వసూలు చేయాలి: కలెక్టర్

image

స్వర్ణ పంచాయతీలకు సంబంధించి 100% పన్ను వసూలు చేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన-2024 సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలంటే ఈ సర్వేను తప్పకుండా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

News November 17, 2025

పక్కా ప్లాన్‌తో మర్డర్.. కుప్పంలో దృశ్యం-3

image

దృశ్యం సినిమాను తలపించేలా కుప్పంలో శ్రీనాథ్‌ను పక్కా ప్లాన్‌తో <<18306471>>హత్య <<>>చేశారు. గత నెల 16, 18, 27వ తేదీల్లో శ్రీనాథ్ కుప్పం వచ్చాడు. ‘నీకు డబ్బులు ఇస్తా. కానీ కుప్పం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టాలి. కుప్పం రైల్వేస్టేషన్లో దిగగానే ఎవరు గుర్తుపట్టని విధంగా తలకు టోపీ, మాస్క్ వేసుకో. సీసీ కెమెరాల కంట పడకుండా రావాలి’ అని ప్రభాకర్ చెప్పాడు. అలాగే చేయడంతో శ్రీనాథ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.