News March 28, 2024

MBNR: ‘కొడంగల్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ’

image

ఎన్నికలు వస్తే ఎవరైనా తీర్థ యాత్రలకు వెళ్దాం అనుకుంటారు.. కానీ నాకు కొడంగల్‌కు వస్తేనే మనశ్శాంతిగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో కొడంగల్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. ఎక్కడైనా పరిశ్రమలు వస్తేనే.. అక్కడి భూములకు విలువ పెరుగుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.

Similar News

News February 5, 2025

MBNR: వివాహితపై లైంగిక దాడి

image

MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News February 5, 2025

MBNR: ‘క్షయ వ్యాధి పరీక్షల సంఖ్యను పెంచండి’

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చేయాలని పరీక్షల సంఖ్యను వెంటనే పెంచాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులను ముందుగా గుర్తించేందుకు అవసరమైన ఎక్స్ రే లను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ కృష్ణ పాల్గొన్నారు.

News February 4, 2025

BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!