News April 2, 2025

MBNR: ఖబర్దార్ రేవంత్ రెడ్డి: డీకే అరుణ

image

‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూములు వేలం వేయడం సరికాదు..ఆ భూములు ఎవరి జాగిరు కాదు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Similar News

News December 9, 2025

తొలి టీ20: టాస్ ఓడిన భారత్

image

కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్‌సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి

News December 9, 2025

సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

image

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

News December 9, 2025

ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

image

మొదటి విడతలోని 8 మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 159 పంచాయతీలు, 1436 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 1510 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 5 గంటలకు తొలివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.