News September 11, 2024
MBNR: ‘గమ్యం యాప్.. సమయాన్ని ఆదా చేస్తుంది’

మహబూబ్ నగర్ టీఎస్ఆర్టీసీ ‘గమ్యం యాప్’ తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం, వివాహ శుభ కార్యాలు, విహారయాత్రల ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
MBNR: సేవా దృక్పథానికి నిదర్శనం జి.వెంకటస్వామి: ఎస్పీ: ఎస్పీ

సామాజిక అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన దివంగత మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అందరికీ చిరస్మరణీయుడని జిల్లా ఎస్పీ జానకి పేర్కొన్నారు. సోమవారం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ప్రదర్శించిన సేవాభావం నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శమని కొనియాడారు.
News December 21, 2025
MBNR: సైబర్ మోసం జరిగితే ‘మొదటి గంట’ కీలకం: ఎస్పీ

సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోతే.. బాధితులు మొదటి గంటలో (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. త్వరగా స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సైబర్ కేసుల విచారణలో ప్రతిభ చాటిన జిల్లా D4C సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
News December 21, 2025
MBNR: లోక్ అదాలత్.. రూ.16,96,579 రికవరీ

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబర్ నేరాల బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించింది. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సైబర్ క్రైమ్ కేసుల్లో మొత్తం రూ.16,96,579 రికవరీకి సంబంధించి 77 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ నేరాల బాధితులకు త్వరిత న్యాయం లభించడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.


