News March 28, 2025
MBNR: గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9.21 లక్షల కార్డులు ఉన్నాయి. ఇప్పటికే రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వాటిని మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ఉగాది రోజు ప్రారంభించనున్నారు.
Similar News
News December 4, 2025
ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.
News December 4, 2025
వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.
News December 4, 2025
పల్నాడు కోనసీమ మంచికల్లులో పోలేరమ్మ తిరుణాల వైభవం.!

పల్నాటి కోనసీమగా పిలవబడే రెంటచింతల మండలం మంచికల్లు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాల మహోత్సవం కోర్ల పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున పెద్ద ఎత్తున ప్రారంభమైంది. కొన్ని వందల సంవత్సరాలుగా డిసెంబర్లో వచ్చే పౌర్ణమి కొర్ల పౌర్ణమిగా పరిగణించి ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తిరుణాలలో మొదట శక్తిని నిలబెట్టి మరుసటి రోజు సాగనంపడం తరతరాల ఆనవాయితీగా వస్తుంది.


