News February 6, 2025
MBNR: గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.
Similar News
News December 1, 2025
జిల్లాలో మండలాలవారీగా సర్పంచ్ నామినేషన్లు

సిరిసిల్ల జిల్లాలో ఆమోదం పొందిన నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
1. రుద్రంగి మండలం గ్రామాలు 10- 32 నామినేషన్లు
2. చందుర్తి మండలం గ్రామాలు 19- 86 నామినేషన్లు
3. వేములవాడ అర్బన్ మండలం గ్రామాలు 11- 51 నామినేషన్లు
4. వేములవాడ రూరల్ మండలం గ్రామాలు 17- 74 నామినేషన్లు
5. కోనరావుపేట మండలం గ్రామాలు 28- 142 నామినేషన్లు
* మొత్తం 85 స్థానాలు
* ఆమోదం పొందిన నామినేషన్లు 385
News December 1, 2025
సిరిసిల్ల జిల్లాలో తొలిదశ నామినేషన్లు 385

రాజన్న సిరిసిల్ల జిల్లా తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 85 గ్రామాల సర్పంచ్ స్థానాలకు 539 నామినేషన్లు దాఖలు కాగా 385 నామినేషన్లను ఆమోదించారు. డబుల్ నామినేషన్ల కారణంగా మిగతా వాటిని తిరస్కరించారు. 748 వార్డులకు 1,696 నామినేషన్లు రాగా, సక్రమంగా లేని కారణంగా ఐదు నామినేషన్లను తిరస్కరించారు. డబుల్ నామినేషన్లు పోగా 1,624 నామినేషన్లను ఫైనల్ చేశారు.
News December 1, 2025
WGL: పంచాయతీల బకాయిలు రూ.99.68 కోట్లు.?

మాజీ సర్పంచులు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు కోరగా, ఉమ్మడి WGL జిల్లాలో మాజీ సర్పంచులకు రూ.79.68 కోట్లు, ప్రత్యేకాధికారుల పాలనలో కార్యదర్శులు చేసిన ఖర్చులు రూ.20 కోట్లు ఉండవచ్చని అంచనా. మొత్తం బకాయిలు రూ.99.68 కోట్లకు చేరే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.


