News February 7, 2025

MBNR: గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆరాధ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. ఆరాధ్య తల్లిదండ్రులను పరామర్శించి, ఓదార్చారు. ఆరాధ్య మృతికి సంబంధించి విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎస్పీ వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

image

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.

News December 9, 2025

కోడి పిల్లలను వదిలాక షెడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్‌లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్‌లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.

News December 9, 2025

పార్వతీపురం: జేసీ నాయకత్వంలో రెవిన్యూ సమస్యలన్నీ పరిష్కారం

image

రెవెన్యూ క్లినిక్ పేరుతో జేసీ నాయకత్వంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు శత శాతం సంతృప్తి చెందినట్లు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ఇది రెవెన్యూ క్లినిక్ అతిపెద్ద విజయమని, ఎవరికైనా సమస్యలు ఉంటే సద్వినియోగం చేసుకోవాలన్నారు.