News February 7, 2025
MBNR: గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆరాధ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. ఆరాధ్య తల్లిదండ్రులను పరామర్శించి, ఓదార్చారు. ఆరాధ్య మృతికి సంబంధించి విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎస్పీ వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
విదేశీ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం: శ్రీధర్ బాబు

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అనుకూల గమ్యస్థానమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఎకో సిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. HYD సచివాలయంలో గురువారం జర్మన్ ఫ్రీడరిక్- ఎబర్ట్- స్టిఫ్టంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డా.సబీన్ ఫాండ్రిక్ మిర్కో గుంథర్, క్రిస్టోఫ్ మోహ్ర్ చర్చించారు. ఆయనతో పాటు పాటు RGM MLA మక్కన్ సింగ్ ఠాకూర్ ఉన్నారు.
News November 27, 2025
కోదాడ: హోరా హోరీగా జాతీయ స్థాయి క్రీడలు

కోదాడ సీసీ రెడ్డి పాఠశాలలో 19వ సీఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీలు గురువారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రిన్సిపల్ ఆన్ జ్యోతి పర్యవేక్షణలో కన్వీనర్ సిస్టర్ ఉడుముల శౌరీలు, సిస్టర్ నక్షత్రం క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్లో విద్యార్థులు ప్రతిభ చూపించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది.
News November 27, 2025
కోదాడ: హోరా హోరీగా జాతీయ స్థాయి క్రీడలు

కోదాడ సీసీ రెడ్డి పాఠశాలలో 19వ సీఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీలు గురువారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రిన్సిపల్ ఆన్ జ్యోతి పర్యవేక్షణలో కన్వీనర్ సిస్టర్ ఉడుముల శౌరీలు, సిస్టర్ నక్షత్రం క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్లో విద్యార్థులు ప్రతిభ చూపించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది.


