News February 21, 2025

MBNR: గొంతు కోసుకున్నాడు..!

image

మహమ్మదాబాద్ మండలంలో ఓ యువకుడు కుటుంబ సమస్యల కారణంగా గొంతు కోసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. చౌదర్‌పల్లికి చెందిన ఖాసీం ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి గురై బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Similar News

News February 22, 2025

MBNR: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

image

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్‌ఎల్‌బీసీ ఎడమగట్టు కాలువ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో అనేక మంది కార్మికులు గాయాలపాలు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులను పునఃప్రారంభం చేశారు. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

News February 22, 2025

MBNR: ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది ఎక్కడంటే!

image

రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నారాయణపేటలో లాంఛనంగా ప్రారంభించారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేసి.. ఇండ్ల నిర్మాణానికి పత్రాలను గ్రామ మహిళలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రెడ్డిని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

News February 22, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేర్పింలి: కలెక్టర్లు
✔పాలమూరులో భారీ అగ్నిప్రమాదం
✔రైతు భరోసాకే దిక్కులేదు.. ఇండ్లు ఎలా ఇస్తారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✔ఘనంగా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం
✔GDWL:AP పోలీసులు దౌర్జన్యం చేశారు:BRS
✔ప్రపంచం సోషలిజం వైపు చూస్తోంది:CPM
✔NRPT: మహిళా పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం
✔హామీలపై(BRS,BJP) చర్చకు సిద్ధమా:CM రేవంత్‌రెడ్డి

error: Content is protected !!