News March 25, 2025

MBNR: చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: రంగినేని అభిలాశ్

image

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల సరికాదని BRS మహబూబ్‌నగర్ నేత రంగినేని అభిలాశ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

జూరాలకు ఇన్ ఫ్లో 20,000 క్యూసెక్కులు

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. శనివారం సాయంత్రం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 20,000 క్యూసెక్కులు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టు నుంచి 22,680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి ప్రధాన కాలువకు 600 క్యూసెక్కులు, మొత్తం 23,327 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎడమ కాలువ, సమాంతర కాలువ, భీమాకు నీటి విడుదల నిలిపివేశారు.

News October 25, 2025

US ఆఫీసర్ హత్య.. మోదీని టార్గెట్ చేసినందుకేనా?

image

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్‌లో హత్యకు గురవడం అనుమానాలకు దారితీసింది. PM మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్‌ను హతమార్చిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్‌ కార్లో రహస్యంగా చర్చించారని పేర్కొన్నాయి. దేశ ప్రజలకు నిజమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత సింఘ్వీ తాజాగా డిమాండ్ చేశారు.

News October 25, 2025

‘మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి’

image

మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.