News February 3, 2025

MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News December 7, 2025

కొత్తగూడెం: వామ్మో.. రూ.12.35 లక్షల కరెంటు బిల్లు హా

image

ప్రతినెల వేలల్లో వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.12,35,191 రావడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన షాపు నిర్వాహకుడు అశోక్‌ ఆందోళనకు గురయ్యారు. గత నెలలో రూ.40,063 ఉన్న బిల్లు ఈ నెలలో లక్షల్లో చేరడాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని, సరిచేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 7, 2025

శ్రీసత్యసాయి: తల్లిదండ్రుల మృతి.. అనాథలైన ఇద్దరమ్మాయిలు

image

పరిగిలో అమ్మానాన్నలు మృతి చెందడంతో వారి ఇద్దరి అమ్మాయిలు అనాథలయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లి మరణించగా.. శనివారం తెల్లవారుజామున తండ్రి భజంత్రీ గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు ఇద్దరూ అనాథలయ్యారు. మండల పాత్రికేయులు తమ వంతుగా ఆ బాలికలకు ఆర్థిక సాయం అందజేసి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తోడుంటామని భరోసా కల్పించారు.

News December 7, 2025

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు ప్రకాశం DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. యర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గతనెల 11న అనారోగ్యానికి గురైంది. అయితే మెరుగైన చికిత్స కోసం గుంటూరు GGHకు తరలించారు. 29న అక్కడ నిర్వహించిన <<18481778>>టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్<<>> వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.