News February 3, 2025
MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.
Similar News
News December 10, 2025
రంప: డిప్యూటీ డైరెక్టర్కు షోకాజ్ నోటీసు?

రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్యకు ITDA పీవో స్మరణ్ రాజ్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోకవరం పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం వార్డెన్గా పని చేస్తున్న సంబుడును పీఓ అనుమతి లేకుండా రంపచోడవరం సహాయ గిరిజన సంక్షేమాధికారిగా నియమించినందుకుగాను నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి ITDA POకు ఫిర్యాదు చేయడంతో నోటీసు అందజేశారని తెలిసింది.
News December 10, 2025
తిరుపతి: పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం.!

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(BRAOU) పరిధిలో M.B.A, M.LI.Sc విద్యార్థులు PG మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాలని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కో-ఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబర్ 22 చివరి తేదీ అని చెప్పారు. మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్సైట్ చూడాలని సూచించారు.
News December 10, 2025
గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.


