News February 3, 2025

MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News November 18, 2025

NABFINSలో ఉద్యోగాలు

image

<>NABARD <<>>ఫైనాన్షియల్ సర్వీసెస్ (NABFINS)21 రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. ఇంగ్లిష్, లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం, రాయడం, మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వెబ్‌సైట్: https://nabfins.org/

News November 18, 2025

తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

image

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 18, 2025

NTR వీరాభిమాని ఆగయ్యకు నేతల నివాళులు

image

TDP సీనియర్ నేత, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో PDPL MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. TDP ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతగా ఆగయ్య పార్టీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని, ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్నారని నేతలు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.