News September 22, 2024
MBNR: చైన్ సిస్టమ్ అంటూ.. రూ.12కోట్లు బురిడీ

లోన్ యాప్లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది మోసపోయారు. రూ.1.20లక్షలు డిపాజిట్ చేస్తే మరుసటి నెల నుంచి రూ.4,000 వడ్డీ చెల్లిస్తామంటూ చెప్పిన మాటలకు, డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయినట్లు బాధితులు వాపోయారు. చైన్ సిస్టమ్లో కల్వకుర్తిలోనే దాదాపు 1,000 మంది ఈ స్కీమ్లో చేరి రూ.12 కోట్లు డిపాజిట్ చేసినట్లు విచారణలో తేలింది. నిర్వాహకుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
Similar News
News February 25, 2026
పాలమూరు: DEGREE.. దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్నగర్లోని(దొడ్డలోనిపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నూతన ఏడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 24, 2026
రేపు పీయూలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’

పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రావీణ్యం కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వెల్లడించారు.
News February 24, 2026
జడ్చర్ల: గొల్లపల్లి చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యం!

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.


