News April 9, 2024

MBNR: జిల్లాలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం

image

ఉమ్మడి MBNR జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి రెండు ఎంపీ స్థానాలపై గురి పెట్టారు. నిన్న కొడంగల్‌లో పర్యటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

Similar News

News December 16, 2025

MBNR: ఓటు హక్కును వినియోగించుకోండి- ఎస్పీ

image

ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

MBNR: ఫేస్-3..సిబ్బందికి ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలో BRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు.

News December 16, 2025

MBNR: 145 గ్రామాలు, 212 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లా మొత్తం మూడో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో 145 గ్రామాల్లో 212 పోలింగ్ కేంద్రాలు, 1254 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 44 సమస్యాత్మక గ్రామాల్లో 52 పోలింగ్ కేంద్రంలో 394 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎస్పీ డి.జానకి వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా 44 రూట్ మొబైల్స్, 16 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FST), 5 స్ట్రైకింగ్ ఫోర్సులు, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు మోహరించినట్లు తెలిపారు.