News July 31, 2024
MBNR: జిల్లాల వారీగా 2వ విడత రుణమాఫీ!

1.మహబూబ్ నగర్:22,253 మంది రైతులకు గాను..219 కోట్లు 2.నాగర్ కర్నూల్:32,406 మంది రైతులకు గాను..312 కోట్లు 3.గద్వాల్:16,489 మంది రైతులకు గాను..166 కోట్లు 4.వనపర్తి:15,085 మంది రైతులకు గాను..140 కోట్లు 5.నారాయణపేట:17,880 మంది రైతులకు గాను..186 కోట్ల రుణమాఫీ అయ్యింది. రెండు విడతలు కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2,85,067 మంది రైతులకు రూ.2,095.22 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 11, 2025
సల్కర్పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేట 8.3 డిగ్రీలు, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 9.4, బాలానగర్ 9.5, రాజాపూర్ 9.8, భూత్పూర్ 9.9, మహమ్మదాబాద్ 10.4, కౌకుంట్ల 10.7, కోయిలకొండ మండలం పారుపల్లి, మూసాపేట మండలం జానంపేట10.8, దేవరకద్ర, మిడ్జిల్ మండలం దోనూరు 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.
News December 11, 2025
మహబూబ్నగర్ గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గండీడ్, రాజాపూర్, మహమ్మదాబాద్, నవాబ్పేట, మహబూబ్నగర్ రూరల్ మండలాల్లోని 139 పంచాయతీల్లో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?
News December 10, 2025
MBNR: పల్లె బాట పట్టిన పట్టణవాసులు

మహబూబ్నగర్ జిల్లాలో రేపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు, ముంబై వలస వెళ్లిన కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులలో రద్దీ గణనీయంగా పెరిగింది. కొందరు సొంత వాహనాలతో తమ గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.


