News March 21, 2025

MBNR: టెన్త్ పరీక్షలు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా!

image

టెన్త్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ✔MBNR:60 పరీక్ష కేంద్రాలు-13,038 మంది విద్యార్థులు ✔NRPT:39 పరీక్ష కేంద్రాలు-7,631 మంది విద్యార్థులు ✔NGKL: 60 పరీక్ష కేంద్రాలు-10,598 మంది విద్యార్థులు ✔GDWL: 40 పరీక్ష కేంద్రాలు-7,717 మంది విద్యార్థులు ✔WNPT:36 పరీక్ష కేంద్రాలు-6,853 మంది విద్యార్థులు >ALL THE BEST!!

Similar News

News February 26, 2026

జనగామ: ‘ఆర్టీసీ సేవల్లో సమస్యలా.. రేపు ఫోన్ చేయండి’

image

ఆర్టీసీ బస్సు సర్వీసులపై సమస్యలు, సూచనలు స్వీకరించేందుకు శుక్రవారం జనగామ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఎస్. స్వాతి తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 9959226050 నంబర్‌కు ఫోన్ చేసి బచ్చన్నపేట, పాలకుర్తి సహా పలు మండలాల ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News February 26, 2026

GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8  తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.

News February 26, 2026

ఏలూరు: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వివరించారు. దీంతో పరీక్షా శాతం 98 శాతంగా నమోదు అయిందన్నారు.