News March 21, 2025

MBNR: టెన్త్ పరీక్షలు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా!

image

టెన్త్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ✔MBNR:60 పరీక్ష కేంద్రాలు-13,038 మంది విద్యార్థులు ✔NRPT:39 పరీక్ష కేంద్రాలు-7,631 మంది విద్యార్థులు ✔NGKL: 60 పరీక్ష కేంద్రాలు-10,598 మంది విద్యార్థులు ✔GDWL: 40 పరీక్ష కేంద్రాలు-7,717 మంది విద్యార్థులు ✔WNPT:36 పరీక్ష కేంద్రాలు-6,853 మంది విద్యార్థులు >ALL THE BEST!!

Similar News

News November 15, 2025

గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలి: SP

image

బాపట్ల జిల్లాకు వస్తున్న గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. సూర్యలంక వద్ద గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, తిరిగి వెళ్లే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు.

News November 15, 2025

నిర్మల్: రేపటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

image

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నింగ్ సెంటర్(103)లో 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ M.సుధాకర్, కోఆర్డినేటర్ U.గంగాధర్ తెలిపారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించి 1, 3&5 సెమిస్టర్ తరగతులు ఉంటాయన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని కావాలన్నారు.

News November 15, 2025

విశాఖలో కూడా ఫిట్నెస్ టెస్ట్‌లకు అనుమతులు: మంత్రి

image

గంభీరంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ I&Cవెహికల్ ఫిట్నెస్ సెంటర్‌ను రవాణాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డీటీసీ ఆర్సిహెచ్ శ్రీనివాస్‌తో కలిసి శనివారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి టెస్టింగ్ మెషినరీ పనులను వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. విశాఖలో కూడా రవాణా వాహనాల ఫిట్నెస్ టెస్ట్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని పేర్కొన్నారు.