News October 9, 2024
MBNR: డీఎస్సీకి 1,131 మంది ఎంపిక

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,131 మందితో DSC తుది జాబితాను విద్యాధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు నేడు LB స్టేడియంలో CM రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. MBNR-243, గద్వాల-172, NGKL- 285, వనపర్తి-152, NRPT-279 మంది ఎంపికయ్యారు. వారిని సీఎం సభకు తరలించేందుకు జిల్లాల వారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలను కేటాయించనున్నట్లు సమాచారం.
Similar News
News October 25, 2025
జడ్చర్ల: ఎమ్మెల్యే సోదరుడిపై వేటు?

జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య 4 రోజుల క్రితం ప్రకటన విడుదల చేశారు. ఆయనను ‘దొంగ’గా సంబోధించడంపై కృష్ణయ్య ఆగ్రహించారు. అయితే, మండల అధ్యక్షుడు జిల్లా స్థాయి నాయకుడిపై సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని DCC నాయకులు అంటున్నారు. ఈ ఘటన పాలమూరు కాంగ్రెస్లో విభేదాలను తీవ్రతరం చేసింది.
News October 24, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో రేపు ఓపెన్ హౌస్

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్ శాఖ పనితీరు, ఆధునిక పోలీసింగ్ విధానాలు, సైబర్ క్రైమ్పై ప్రజల్లో చైతన్యం కల్పించే అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
News October 24, 2025
మహబూబ్నగర్: పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోలుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూకం, బస్తా, తేమ కొలిచే పరికరాల సదుపాయాలు ఉండేలా చూడాలని సూచించారు.


