News February 1, 2025

MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

image

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్‌పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్‌లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 23, 2025

ఈ నెలాఖరు నుంచి ఫ్యామిలీ సర్వే

image

AP: ఈ నెలాఖరు నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(UFS) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపింది. ‘అర్హులకు సంక్షేమ పథకాలు, సేవలు అందించడం, కుటుంబాల సమాచారాన్ని అప్డేట్ చేయడం ఈ సర్వే ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సర్టిఫికెట్ల జారీ సులభతరమవుతుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లదు’ అని పేర్కొంది.

News December 23, 2025

కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర తేదీలు ఇవే

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి ఆలయంలో 2026 సం.నికి సంబంధించిన బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జనవరి 10న వీరభద్ర స్వామి కళ్యాణం, 14న భోగి పండుగ, 15న బండ్ల తిరుగుట(సంక్రాంతి) కార్యక్రమాలు జరుగనున్నాయి. జనవరి 18న అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

News December 23, 2025

సీఎం చంద్రబాబు సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్ ఆవిష్కకరణ

image

సీఎం చంద్రబాబు సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్ ఆవిష్కరించారు. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో హైడ్రో & కెమికల్ రాకెట్రీ పోటీలు, ISRO గుర్తింపు పొందిన ముస్కాన్ ఎడ్యుకోమ్ & స్పేస్ కిడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. విజేతలకు రూ.1.5 లక్షల బహుమతులు, ఇంటర్న్‌షిప్, STEM & అంతరిక్ష అవకాశాలు ఉంటాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు తెలిపారు.