News February 1, 2025
MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 18, 2025
ములుగు: ‘ఎస్సై వేధిస్తున్నాడు.. ఆత్మహత్యకు అనుమతించండి’

ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి కుటుంబీకులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఆత్మహత్యకు అనుమతించాలని మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన- ప్రతాప్ రెడ్డి దంపతులు భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.దంపతులకు గ్రామంలో ఉన్న 12 ఎకరాల భూమికి చెందిన బండ్ల బాటను ఎస్సై, అతడి కుటుంబీకులు 2022 మే 15న దున్ని వారి భూమిలో కలుపుకొన్నారన్నారు. కేసులు పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు.
News February 18, 2025
టైరు పేలి టాటా ఏస్ బోల్తా

వెల్దుర్తి మండల సమీపంలోని అల్లుగుండు పెట్రోల్ బంక్ దగ్గర నేషనల్ హైవేపై మంగళవారం టైరు పేలి టాటా ఏస్ బోల్తా పడింది. కర్నూలు మార్కెట్కు వేరుశనగ కాయలు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్తో సహా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News February 18, 2025
భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్లో విండీస్పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్పై ఈ స్కోర్లు చేశారు.