News January 30, 2025

MBNR: తల్లి నిద్రలేచేసరికి.. దూలానికి వేలాడుతూ కొడుకు

image

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్ర లేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసునమోదు చేశారు.

Similar News

News February 17, 2026

ఇందాపూర్ సహా 4 డెయిరీలకు నెయ్యి ఆర్డర్లు: BR నాయుడు

image

AP: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యి కొనుగోలులో నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ‘నెయ్యి నాణ్యత తగ్గకుండా సేకరణ పరిధిని 1,500KM నుంచి 800KMకు తగ్గించాం. ట్యాంకర్లకు GPS లాక్ సిస్టమ్ ఏర్పాటుచేశాం. అలాగే ఇందాపూర్ డెయిరీకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చామనేది అవాస్తవం. ప్రమాణాలు పాటించిన నందిని, మదర్, సంగం డెయిరీలకూ ఆర్డర్లు ఇచ్చాం’ అని ట్వీట్ చేశారు.

News February 17, 2026

పన్నుల వసూళ్లలో పురోగతి సాధించాలి: కలెక్టర్ ఆదేశం

image

ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్సులు, భవన అనుమతులు, పెండింగ్ లేఅవుట్ పర్మిషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపల్ కమిషనర్లు పాల్గొని తమ పరిధిలోని పురోగతిని వివరించారు.

News February 17, 2026

అప్పటి నుంచే పతనం మొదలైందా..?

image

2023 వన్డే ప్రపంచకప్ గెలిచాక మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా అన్ని ఫార్మాట్లలో చెత్త ప్రదర్శన చేసింది.
*2024 టీ20 WCలో సెమీస్ చేరలేకపోయింది.
*27 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై WIతో టెస్టు ఓటమి
*2025 CT సెమీఫైనల్లో భారత్‌తో ఓటమి
*2025 WTC ఫైనల్లో SAతో ఓటమి
*పాక్, శ్రీలంక, SAతో వన్డే సిరీసుల్లో ఓటమి
*టీ20 WC-2026లో జింబాబ్వే చేతిలో ఓటమి