News January 30, 2025

MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

image

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్‌లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Similar News

News December 2, 2025

VKB: పంచాయతీ బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో..?

image

వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు. రేపటితో తొలివిడత బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో తేలనుంది.

News December 2, 2025

WGL: రెండో విడతకు నేడు చివరి రోజు

image

ఉమ్మడి జిల్లాలో రెండో దశ నామినేషన్ల స్వీకరణ నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో 564 జీపీలు, 4928 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2 వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం, 3న పోటీలో ఉన్న వారి జాబితాను సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్నారు. 6న నామినేషన్ల ఉపసంహరణ, 14న పోలింగ్ ఉండనుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 1,365 నామినేషన్లు, వార్డు స్థానాలకు 3037 నామినేషన్లు దాఖలయ్యాయి.

News December 2, 2025

మదనపల్లె జిల్లా ప్రకటించినా..!

image

మదనపల్లె జిల్లాపై ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ హామీ ఇచ్చారు. తాజాగా జిల్లాను ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వంతోనే జిల్లా సాధ్యమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోస్టర్లు పంచాలని హైకమాండ్ ఆదేశించింది. ఇక్కడ గ్రూపులు, ఖర్చు ఎందుకులే అని నాయకులు ప్రచారం చేయకుండా సైలెంట్ అయ్యారట. నా వల్లే వచ్చిందని MLA, నావల్లే వచ్చిందని మరికొందరు వేర్వేరుగా చెప్పుకోవడం కొసమెరుపు.