News January 30, 2025

MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

image

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్‌లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Similar News

News October 27, 2025

భారత్‌తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

image

వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్‌గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్‌కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.

News October 27, 2025

పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎస్పీ

image

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. సోమవారం అమలాపురం పోలీసు కార్యాలయంలో ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ తగాదాలకు సంబంధించిన వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు.

News October 27, 2025

పత్తిలో తేమ శాతం పెరిగితే మద్దతు ధర కష్టం: మంత్రి తుమ్మల

image

TG: పత్తి రైతులకు గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి అమ్మకాల విషయంలో రైతులు CCI ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత, తేమను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి మించకుండా చూసుకోవాలని.. 12 శాతానికి మించి తేమ ఉంటే కనీస మద్దతు ధర పొందడం కష్టమన్నారు. దీనికి అనుగుణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.