News August 19, 2024

MBNR: దుకాణాల్లో మొదలైన రాఖీ సందడి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో రాఖి అమ్మకాలు జరుగుతుండడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది వ్యాపారాలు భారీగా పెరిగాయి. సుమారు 43 లక్షల జనాభాలో 50 శాతం మహిళలే ఉన్నారు. అందులో 15 లక్షల మంది క్రమం తప్పకుండా రాఖీలు కడతారని అంచనా. ఈ ఏడాది రాఖీలు, మిఠాయిల కొనుగోళ్లు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.16 కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

Similar News

News July 5, 2025

NRPT: అథ్లెటిక్స్ ఆడెందుకు బయలుదేరిన క్రీడాకారులు

image

తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఆడిందుకు నారాయణపేట జిల్లా క్రీడాకారులు శనివారం బయలుదేరారు. హనుమకొండలో రేపటి నుంచి ప్రారంభమయ్యే “Trithalon అథ్లెటిక్స్” అండర్-10, 12, 14 విభాగంలో 60 మీ. రన్నింగ్, లాంగ్ జంప్, జావిలిన్ త్రో తదితర క్రీడల్లో 20 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మండల విద్యాధికారి కృష్ణారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ రమణ బెస్ట్ విషెస్ తెలిపారు.

News July 5, 2025

MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

image

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News July 5, 2025

MBNR: ‘58 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం’

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తంగా 58 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అటవీ, ఉపాధి హామీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో 66.12 లక్షల మొక్కలను ఈపాటికే పెంచారు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గుంతలు తీసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రహదారుల వెంట 27,26,668 మొక్కలను నాటనున్నారు.