News December 20, 2024

MBNR: ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై శ్రద్ధ వహించండి.!

image

ధరణి పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లోరెవెన్యూ శాఖకు సంబంధించి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. మండలంల వారీగా ధరణి దరఖాస్తుల పెండింగ్‌పై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

Similar News

News September 18, 2025

మహబూబ్ నగర్ జిల్లా వర్షపాతం వివరాలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో 7.0 వర్షపాతం రికార్డు అయింది. అడ్డాకుల 3.5 మిల్లీమీటర్లు, నవాబుపేట మండలం కొల్లూరు 2.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసి మరికొన్ని ప్రాంతాలలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

News September 18, 2025

WOW వన్డే లీగ్.. బౌలింగ్‌లో సత్తా చాటిన గద్వాల కుర్రాడు

image

HYDలోని KCR-2 మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్డే క్రికెట్ లీగ్ టోర్నీలో గద్వాల్ జట్టు కుర్రాడు వెంకట్ సాగర్ బౌలింగ్ లో సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల్ జట్టు 44.4 ఓవర్లలో 332/10 పరుగులు చేయగా.. HYD జట్టు కేవలం 20.3 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. 9 వికెట్లు తీసిన గద్వాల్ జట్టు క్రీడాకారుడు వెంకట్ సాగర్‌కు కోచ్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

News September 18, 2025

MBNR: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ జానకి

image

అధికారుల పేరుతో నగదు కోరే మెసేజీల పట్ల ప్రజలు మోసపోవద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల జిల్లాలో పలువురు సైబర్ నేరగాళ్ల పన్నాగాలకు గురవుతున్నారని, అధికారులు వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని అడగరని ఆమె తెలిపారు. ఇటువంటి మెసేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.