News February 18, 2025
MBNR: నలుగురు తహశీల్దార్లను బదిలీ చేసిన కలెక్టర్

జిల్లాలో పనిచేస్తున్న నలుగురు తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బదిలీ చేశారు. జడ్చర్ల తహశీల్దారు బ్రహ్మం గౌడ్ ను సెక్రటేరియట్ కు బదిలీ చేయగా ఆయన స్థానంలో కలెక్టరేట్లోని ఈ సెక్షన్ తహశీల్దారు నర్సింగ్రావును నియమించారు. కలెక్టరేట్ ఈ సెక్షన్ తహశీల్దార్గా అడ్డాకుల తహశీల్దారు మదన్మోహన్ను నియమించగా, సెక్రటేరియట్ నుంచి శేఖర్ అడ్డాకుల తహశీల్దారుగా నియమితులయ్యారు. వీరు బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News November 24, 2025
జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. 167 జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు

పుట్టపర్తి సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి పూలమాల వేసి సత్యసాయి బాబా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్బీ డీఎస్సీపీ రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, శైలుతో పాటు పోలీస్ శాఖకు చెందిన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
News November 23, 2025
అరుణాచలం వెళ్లే భక్తులకు పాలమూరు డిపో శుభవార్త

మహబూబ్ నగర్ జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల ప్రదక్షణకు వెళ్లే భక్తులకు డిపో మేనేజర్ సుజాత శుభవార్త తెలిపారు. డిసెంబర్ 3న బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్యాకేజీ రూ.3600 ఉంటుందన్నారు. https://tsrtconline.in బుక్ చేసుకోవాలని తెలిపారు. 9441162588 నంబర్ను సంప్రదించాలన్నారు.


