News March 27, 2025

MBNR: నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ 6,9 తరగతుల ప్రవేశం కోసం జనవరి 18న పరీక్ష నిర్వహించారు. బుధవారం పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయని ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. 6వ తరగతిలో 75 మంది విద్యార్థులు, 9వ తరగతిలో 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. విద్యార్థుల సమాచారం వ్యక్తిగతంగా సేకరిస్తామన్నారు.

Similar News

News November 24, 2025

అమెరికా వీసా రాలేదని.. గుంటూరు డాక్టర్ సూసైడ్

image

అమెరికా J1 వీసా రాలేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ సూసైడ్ చేసుకుంది. గుంటూరుకి చెందిన డాక్టర్ రోహిణి కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం ఇటీవల వీసాకు అప్లై చేయగా.. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కలత చెందిన రోహిణి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుంటూరులోని సొంత నివాసానికి తరలించారు.

News November 24, 2025

ఎన్నికలకు సిద్ధం.. కోర్టుకు తెలపనున్న Govt, SEC

image

TG: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు ఇవాళ HCలో విచారణకు రానుంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్లు ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 50% రిజర్వేషన్లు మించకుండా GOలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పనుంది. అటు పూర్తి ఏర్పాట్లు చేశామని, అధికారులు, సిబ్బంది సమాయత్తంపై ఎన్నికల సంఘం వివరించనుంది. నిన్నటి నుంచి గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లపై మండల ఆఫీసుల్లో లిస్టులను అధికారులు ప్రదర్శనకు ఉంచారు.

News November 24, 2025

రేపు పులివెందులలో జగన్ పర్యటన

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.