News March 9, 2025

MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

image

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Similar News

News March 10, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 10, 2025

నవాబుపేట : బాలుడిపై కత్తితో దాడి.. అనంతరం పరారీ

image

నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్‌పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.

News March 10, 2025

MBNRలో 700 ఏళ్ల నాటి మర్రిచెట్టు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 700 ఏళ్లనాటి మర్రి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద పరిమాణం గల మూడో చెట్టుగా ఇది పేరుగాంచింది. దూరం నుంచి చూస్తే కొండలాగా కనిపించే ఇది దగ్గరికెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా మారిపోతుంది. మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న దీని పక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలోనే ఉంది. సందర్శించారా? కామెంట్ చేయండి.

error: Content is protected !!