News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News March 10, 2025
వత్సవాయి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలమవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వత్సవాయి మండలం ఆలూరుపాడు గ్రామంలో జరిగింది. MS చదువుతున్న శ్రావణి(27)కి హైదరాబాద్కి చెందిన భానుప్రకాశ్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రేమ విఫలమవడంతో శ్రావణి గడ్డి మందు తాగింది. తల్లిదండ్రులు హుటాహుటిన ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శ్రావణి ఆదివారం రాత్రి మరణించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 10, 2025
కడప: వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్ మనోడికే.!

ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజ బ్యాడ్మింటన్లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాకింగ్స్ డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ రామ్తో కలిసి వరల్డ్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈయన ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 3 మెడల్స్ సాధించగా.. జాతీయస్థాయిలో 17 పతకాలు సాధించాడు. కడప బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు ఆయన్ను సత్కరించారు.
News March 10, 2025
కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్లోని ఉప్ని సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బొలెరోను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. 14 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను రేవా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్కర్ సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.