News November 28, 2024
MBNR: నూనెపడి విద్యార్థినికి గాయాలు.. స్పెషల్ ఆఫీసర్ సస్పెన్షన్

నవాబ్పేటలోని కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి <<14727126>>విద్యార్థిని జల్సా <<>>పై వేడి నూనెపడి గాయాలైన గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తహాశీల్దార్ శ్రీనివాసులును విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ నివేదిక ఆధారంగా పాఠశాల ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విచారణ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ల కూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్ల విత్డ్రా

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.
News December 7, 2025
MBNR: సర్పంచ్ బరిలో 641 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
News December 7, 2025
MBNR: మూడో విడతలో 2,786 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలకు సంబంధించిన తుది వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,152 వార్డులకు గాను, ఏడు వార్డులు మినహా 1,145 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 2,786 మంది వార్డు సభ్యులు నిలిచినట్టుగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జడ్చర్లలో అత్యధికంగా 376, బాలానగర్లో 308 మంది పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు.


