News May 21, 2024

MBNR: నేటితో ముగియనున్న పీయూ వీసీ పదవీకాలం

image

పాలమూరు యూనివర్సిటీ వైస్ కౌన్సిలర్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. 2021 మే 21న లక్ష్మీకాంత్ రాథోడ్‌ను మూడేళ్ల పదవీ కాలానికి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారంతో ఆయన పదవీకాలం ముగియనుండటంతో ఆయన OUకి తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి ఇవ్వనన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. దీంతో రాష్ట్రంలోనే పీయూ వీసీ పోస్టుకు పోటీ పెరిగింది.

Similar News

News December 12, 2025

MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

News December 12, 2025

MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

MBNR: గెలుపొందిన అభ్యర్థులకు డీజు సౌండ్‌తో ర్యాలీకి అనుమతి లేదు: ఎస్పీ డి.జానకి
@ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.
@రాజపూర్ మండలం రంగారెడ్డిగూడ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి 31 ఓట్లతో గెలుపు.
@నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపు.
@రాజాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కావలి రామకృష్ణ 1104 భారీ మెజార్టీతో గెలుపు.