News March 21, 2025
MBNR: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

నేటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 239 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 45,837 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అదనపు పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. SHARE IT
Similar News
News November 4, 2025
పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్పై ఐసీసీ వేటు

ఆసియా కప్లో కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్పై 2 మ్యాచుల బ్యాన్ విధించింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు తెచ్చుకున్నందుకు ఈ వేటు వేసింది. 2 మ్యాచుల్లో 30% చొప్పున ఫీజులో కోత పెట్టింది. మరో ఆటగాడు ఫర్హాన్కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఇక <<17831364>>సూర్య<<>>కు మ్యాచ్ (14వ తేదీ) ఫీజులో 30% కోత, 2 డీమెరిట్ పాయింట్లను విధించింది.
News November 4, 2025
నిర్మల్ జిల్లాలో యువకుడి ARREST

నిర్మల్ జిల్లా పెంబి మండలం పోచమ్మపల్లికి చెందిన యువకుడు మెగావత్ వినోద్ ఎండు గంజాయిని బైక్పై తరలిస్తుండగా పట్టుకున్నట్లు నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఎండు గంజాయిని నిర్మల్కు తరలిస్తుండగా కొండాపూర్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 1.710కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. ఎస్ఐ అభిషేకర్, వసంత్ రావ్ ఉన్నారు.
News November 4, 2025
జగిత్యాల: SC స్టడీ సర్కిల్లో విదేశీ ఉద్యోగాల సెమినార్

జగిత్యాల SC స్టడీ సర్కిల్లో TOMCOM ఆధ్వర్యంలో జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలపై అవగాహన సదస్సు జరిగింది. సుమారు 200 మంది యువకులు పాల్గొని తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్యమ్మ, SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేశ్, సీనియర్ సహాయకుడు టి.లింగమూర్తి, జూనియర్ సహాయకులు కె.సదానందం, ఆర్.ప్రసన్న, TOMCOM హైదరాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు.


