News March 21, 2025

MBNR: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

image

నేటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 239 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 45,837 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అదనపు పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. SHARE IT

Similar News

News March 7, 2026

TODAY HEDALINES

image

*13 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్ చేస్తాం: CBN
*ఉగాది తర్వాత లోకేశ్ సీఎం: పేర్ని నాని
*ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్
*ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: CM రేవంత్
*ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్
*యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయం చేస్తోందన్న అమెరికా
*యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల
*TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ: హైకోర్టు

News March 7, 2026

రాములోరి కళ్యాణం.. టికెట్ల రేట్లు ఇవే

image

TG: భద్రాచలంలో ఈ నెల 19 నుంచి APR 2 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో స్వామివారి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం <>ఆన్‌లైన్‌లో<<>> టికెట్లు అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం వెల్లడించింది. కళ్యాణానికి రూ.150 నుంచి రూ.7,500 మధ్య, పట్టాభిషేకానికి రూ.100-రూ.1,500 మధ్య టికెట్లు ఉన్నాయని తెలిపింది.

News March 7, 2026

ఇండియన్ బిలియనీర్ల సంపద రూ.112 లక్షల కోట్లు

image

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం బిలియనీర్ల సంఖ్య 4,020కి చేరింది. గతేడాదితో పోలిస్తే 578 మంది పెరిగారు. 1,100 బిలియనీర్లతో చైనా టాప్‌లో ఉండగా, ఆ తర్వాత US(1,000), IND(308) ఉన్నాయి. ఇండియన్ బిలియనీర్ల సంపద ₹112L Cr. ఇక ఎలాన్ మస్క్ $792Bn ఆస్తితో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆ తర్వాత జెఫ్ బెజోస్-అమెజాన్($300Bn), లారీ పేజ్-ఆల్ఫాబెట్($271Bn), లారీ ఎల్లిసన్-ఒరాకిల్($267Bn) ఉన్నారు.