News March 15, 2025

MBNR: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ ఓపెన్.

Similar News

News January 5, 2026

MBNR: పీయూ.. ఈనెల 7న క్రికెట్ ఎంపికలు

image

పాలమూరు యూనివర్సిటీ పురుషుల, స్త్రీల క్రికెట్ జట్ల ఎంపికలు ఈనెల 7న MBNRలోని ‘MDCA’ మైదానంలో జరగనుంది. సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా VC ప్రొ. జీఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు అర్హులని, ఆసక్తి గల వారు బోనఫైడ్‌పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరుకావాలని సూచించారు.

News January 5, 2026

MBNR: ‘పీఎంశ్రీ’.. జిల్లా స్థాయి పోటీల షెడ్యూల్

image

మహబూబ్ నగర్ జిల్లా పీఎంశ్రీ పాఠశాల జిల్లా స్థాయి పోటీలకు క్రీడాకారులు సిద్ధం కావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. షెడ్యూలు ఇలా!
✒6న బాల,బాలికలకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు
✒6న బాల, బాలికలకు ఫుట్ బాల్ అథ్లెటిక్స్ పోటీలు
అథ్లెటిక్స్‌లో పాల్గొనే పియంశ్రీ పాఠశాల క్రీడాకారులు ఒక్క ఈవెంట్‌లో ఒక్కరు మాత్రమే పాల్గొనాలన్నారు.

News January 5, 2026

మహబూబ్‌నగర్: పేదలకు వరం ‘గృహజ్యోతి’

image

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.