News February 21, 2025

MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

image

సీఎం రేవంత్ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

Similar News

News October 25, 2025

జడ్చర్ల: ఎమ్మెల్యే సోదరుడిపై వేటు?

image

జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య 4 రోజుల క్రితం ప్రకటన విడుదల చేశారు. ఆయనను ‘దొంగ’గా సంబోధించడంపై కృష్ణయ్య ఆగ్రహించారు. అయితే, మండల అధ్యక్షుడు జిల్లా స్థాయి నాయకుడిపై సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని DCC నాయకులు అంటున్నారు. ఈ ఘటన పాలమూరు కాంగ్రెస్‌లో విభేదాలను తీవ్రతరం చేసింది.

News October 24, 2025

MBNR: పోలీస్‌ కార్యాలయంలో రేపు ఓపెన్ హౌస్‌

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం పరేడ్‌ గ్రౌండ్‌లో ‘ఓపెన్‌ హౌస్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్‌ శాఖ పనితీరు, ఆధునిక పోలీసింగ్‌ విధానాలు, సైబర్‌ క్రైమ్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించే అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

News October 24, 2025

మహబూబ్‌నగర్: పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోలుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూకం, బస్తా, తేమ కొలిచే పరికరాల సదుపాయాలు ఉండేలా చూడాలని సూచించారు.