News February 21, 2025

MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

image

సీఎం రేవంత్ రేపు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

Similar News

News December 13, 2025

జగిత్యాల: 853 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు

image

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 1276 పోలింగ్ కేంద్రాలలో 134 సర్పంచ్, 946 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్నికల విధుల్లో 853 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ సామగ్రిని పటిష్ట ఎస్కార్ట్‌తో తరలిస్తూ 57 రూట్లలో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.

News December 13, 2025

ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.

News December 13, 2025

FLASH: చిట్యాల MPDOను సస్పెండ్ చేసిన కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్నకాపర్తిలో సర్పంచ్‌ ఎన్నికల పోలింగ్ స్లిప్పులు డ్రైనేజీలో కనిపించిన ఘటనపై నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మితో పాటు పదిమంది పోలింగ్ ఆఫీసర్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మొత్తానికి చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్ల కలకలంపై అధికారులపై వేటు పడింది.