News February 21, 2025
MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

సీఎం రేవంత్ రేపు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
Similar News
News December 12, 2025
విశాఖలో ఐటీ పెట్టుబడులతో కొలువుల జాతర(1/2)

విశాఖ కాపులప్పాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,583 కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుండగా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇటు మధురవాడ హిల్-4లో నిర్మించనున్న సత్వా వాంటేజ్ క్యాంపస్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 40-50 వేల మందికి ఉపాధి లభించనుంది.
News December 12, 2025
విశాఖలో ఐటీ పెట్టుబడులతో కొలువుల జాతర(2/2)

టెక్ తమ్మిన రూ.62 కోట్లు (500 ఉద్యోగాలు), నాన్రెల్ టెక్నాలజీస్ రూ.50.6 కోట్లు (567 ఉద్యోగాలు), ఏసీఎన్ ఇన్ఫోటెక్ రూ.30 కోట్లు (600 ఉద్యోగాలు), ఇమాజిన్నోవేట్ రూ.140 కోట్లు (2,600 ఉద్యోగాలు), ఫ్లూయెంట్ గ్రిడ్ రూ.150 కోట్లు (2,000 ఉద్యోగాలు), మదర్సన్ టెక్నాలజీ రూ.109.73 కోట్లు (1,775 ఉద్యోగాలు), క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ రూ.115 కోట్లు (2,000 ఉద్యోగాలు) పెట్టుబడులు పెట్టనున్నాయి.
News December 12, 2025
డెలివరీ కోసమే అయితే వీసాలివ్వం: US ఎంబసీ

తమ దేశ పౌరసత్వం కల్పించడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. USలో బిడ్డకు జన్మనివ్వడానికి టూరిస్ట్ వీసాకు అప్లై చేస్తే నిరాకరించనున్నట్లు INDలోని US ఎంబసీ తెలిపింది. USలో జన్మిస్తే సహజ సిద్ధంగా పౌరసత్వం వస్తుందని కొందరు ప్రయత్నిస్తారని, ఆ అడ్డదారులను మూసేస్తున్నట్లు తెలిపింది. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు చెప్పింది.


