News November 22, 2024
MBNR: నేడు పాలమూరుకు బీసీ కమిషన్ రాక

బీసీ కమిషన్ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బీసీ కమిషనర్ ఛైర్మెన్ నిరంజన్ నేతృత్వంలో జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మీలు వస్తున్నారని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నేతలు బీసీ వర్గాల విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవసరమైన రిజర్వేషన్లు దామాషాపై తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు.
Similar News
News October 20, 2025
MBNR జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా దీపావళి సంబరాలు.
@రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో టిప్పర్ ఢీకొని.. లారీ డ్రైవర్ మృతి.
@కౌకుంట్లలో ముగిసిన సదర్ ఉత్సవాలు.
@జడ్చర్లలో పిచ్చికుక్కల దాడి.. చిన్నారులకు గాయాలు.
@జాతీయస్థాయి SGF అండర్-17 వాలీబాల్ పోటీలకు నవాబుపేట యన్మంగండ్ల చెందిన జైనుద్దీన్ ఎంపిక.
@కురుమూర్తి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
@మిడ్జిల్ రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు.
News October 19, 2025
MBNR: దీపావళి.. ఎస్పీ కీలక మార్గదర్శకాలు

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పండుగకు కొన్ని కీలక మార్గదర్శకాలు చేశారు. లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద మాత్రమే బాణసంచా కొనాలని, బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలని సూచించారు. మండే పదార్థాలకు దూరంగా ఉండాలని, సింథటిక్ కాకుండా కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పటాకులు కాల్చాలని సూచించారు.
News October 19, 2025
కురుమూర్తి ఆలయ హుండీ లెక్కింపు రూ.4.48 లక్షల ఆదాయం

చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన హుండీ డబ్బులను శనివారం ఆలయ సిబ్బంది లెక్కించారు. హుండీ ద్వారా రూ.4,48,248 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.