News May 24, 2024
MBNR: నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ నెల 24న పాలిసెట్-2024 నిర్వహిస్తోంది. ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 10,470 మంది విద్యార్థులకు 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.11 నుంచి మ.1.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News November 15, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 11.1, గండీడ్ మండలం సల్కర్పేటలో 11.3, మిడ్జిల్లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్పూర్లో 12.7, మహ్మదాబాద్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News November 14, 2025
కురుమూర్తి స్వామి ఆలయంలో కోడెల వేలం

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన 18 కోడెదూడల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.1,17,000 ఆదాయం లభించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. సభ్యులు భాస్కరాచారి, కమలాకర్ పాల్గొన్నారు.


