News April 24, 2024
MBNR: నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగనుందిలా

CM రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి జిల్లా పర్యటన ఖరారయింది. ఉదయం 11 గంటలకు నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపేట జిల్లా మద్దూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, మధ్యాహ్నం 1 గంటలకు తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరకు హాజరవుతారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు బిజినేపల్లిలో నిర్వహించే బహిరంగసభ కార్యక్రమంలో పాల్గొంటారు.
Similar News
News November 3, 2025
కురుమూర్తి జాతరలో ఆకతాయిల ఆగడాలు

కురుమూర్తి జాతరలో ఆకతాయిల దుశ్చర్యలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండగా కొందరు యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలు తెరిచి ఉండడంతో మత్తులో హంగామాలు సృష్టిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు అపహరిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News November 3, 2025
హన్వాడ: సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉంది

యాదవులు జరుపుకునే సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి హన్వాడ మండలం కేంద్రంలో సదర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సంప్రదాయ పద్ధతులకు నిలయంగా నిలుస్తాయని గుర్తు చేశారు. అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించారు.
News November 2, 2025
MBNR: అక్టబర్లో 21 రెడ్హ్యాండెడ్ కేసులు

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.


