News July 9, 2024
MBNR: పదవీ కాలం ముగిసినా.. అందని వేతనాలు!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసినప్పటికీ వారికి గౌరవ వేతనం అందలేదు. ZPTC, MPP, MPTC 8నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. 2023 అక్టోబరు వరకు వేతనాలు అందాయి. ఆ తర్వాత వీరికి వేతనం అందలేదు. ఈనెల 3న MPPలు, MPTCల పదవీ కాలం ముగియగా, 4న జడ్పీ ఛైర్పర్సన్, ZPTCల పదవీ కాలం ముగిసింది. ZP ఛైర్పర్సన్కు నెలకు రూ. లక్ష, ZPTCలకు రూ.13 వేలు, MPTCలకు రూ.6,500 వేతనం ఉంది.
Similar News
News November 12, 2025
MBNR: భరోసా ఏడాది పూర్తి.. మొత్తం 163 కేసులు

మహబూబ్నగర్లోని భరోసా కేంద్రం స్థాపించబడి నేటికీ ఏడాది పూర్తి అయింది. మొత్తం 163 కేసులు భరోసా కేంద్రానికి అందాయి. CWC వారి భాగస్వామ్యంతో సహకారంతో POCSO కేసులు-117, రేప్ కేసులు-24, ఇతర కేసులు-22 వచ్చాయని, కౌన్సెలింగ్-218, పరిహారాలు-119 అందయన్నారు. DWO సహకారంతో ఇప్పటివరకు మొత్తం 45 బాధితులకు రూ.11,25,000 విలువైన పరిహారం అందించామని అధికారులు వెల్లడించారు.
News November 12, 2025
MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
News November 12, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


