News March 19, 2025

MBNR: పరీక్షల ఫీజు చెల్లింపునకు రేపే లాస్ట్..!

image

పాలమూరు యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈనెల 20న ఆఖరి తేదీ కానుండగా, ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని రెగ్యులర్& బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ కాలేజీ వెబ్‌సైట్‌లో చెల్లించుకోవచ్చని చెప్పారు. సంబంధిత పత్రాలను కాలేజీలో సమర్పించి, రసీదును పొందాలన్నారు. 

Similar News

News November 12, 2025

తిరుపతి: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట మండలం తడుకు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి-చెన్నై హైవేపై నడిచి వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ చనిపోయారు. మృతులు విజయపురం మండలం KVపురం గ్రామానికి చెందిన రంజిత్ నాయుడు(52), వడమాలపేట మండలం SBRపురం(గుళూరు)కు చెందిన బాబురాజు అలియాస్ నరసింహరాజుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

ఉప్పల్: అంధ విద్యార్థుల పరీక్షలకు వాలంటీర్లు కావాలి

image

చిన్నజీయర్‌ ఆశ్రమంలో డిగ్రీ మొదటి సంవత్సరం అంధ విద్యార్థుల పరీక్షలకు స్రైబ్‌ల కోసం వాలంటీర్లు కావాలని కోరారు. సంస్కృతం చదవగలిగే, తెలుగులో నిర్దోషంగా రాయగల 20 మంది వాలంటీర్లు కావాలని తెలిపారు. ఈ నెల 14న ఉ.9-12 వరకు, మ.2- 5 వరకు జరిగే రెండు పరీక్షా సెషన్లకు స్రైబ్‌లుగా సేవలందించాలని వివరించారు. ఉప్పల్‌ నుంచి ఉచిత నుంచి బస్‌ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలకు 9032521741లో సంప్రదించాలన్నారు.

News November 12, 2025

సీఎం చంద్రబాబుతో ఫోర్జ్ వైస్ ఛైర్మన్ భేటీ

image

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణి చర్చించారు. విశాఖలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. గండికోట, పాపికొండలు, అరకువ్యాలీలో టూరిజం ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపారు. ఏపీలో ఉన్న వివిధ అవకాశాలను సీఎం ఆయనకు వివరించారు. గ్లోబల్ బ్రాండ్‌గా అరకు కాఫీ మారిందన్నారు.