News March 21, 2025
MBNR: పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 24 వరకు పెంపు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలలో 2వ, 4వ&6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వరకు గడువు ముగియనుండగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 24వరకు, ఆలస్య రుసుముతో ఈనెల 27 వరకు గడువు పెంచుతున్నట్లు కాలేజీలకు అధికారులు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థుల నిమిత్తమే ఫీజు చెల్లింపు గడువు పెంచినందుకు డిగ్రీ విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. SHARE IT.
Similar News
News December 8, 2025
KMR: స్థానిక పోరులో కొత్త ట్రెండ్

కామారెడ్డి జిల్లాలో సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎన్నో ఏండ్లుగా తగాదాల కారణంగా దూరమైన ఓటర్ల వద్దకు నేరుగా వెళ్తున్నారు. పాత విభేదాలు, ఘర్షణలను పక్కన పెట్టి, ‘క్షమించండి’ అంటూ చేతులు జోడిస్తున్నారు. ఈ భావోద్వేగపూరిత ప్రచారం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
News December 8, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల,డివిజన్ కేంద్రాలు,మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా,ఆన్లైన్లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చున్నారు.
News December 8, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల,డివిజన్ కేంద్రాలు,మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా,ఆన్లైన్లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చున్నారు.


